జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి
సూర్యాపేట జిల్లా వ్యవసాయ శ్రీధర్ రెడ్డి
నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని,కావున రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శ్రీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని జయలక్ష్మి ఫెర్టిలైజర్ షాప్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఫర్టిలైజర్ షాప్ లో ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, బిల్ బుక్కులు, స్టాక్ రిజిస్టర్స్, గోడౌన్ లో స్టాక్ ని వెరిఫై చేసి డీలర్లకు తగు సూచనలు చేశారు.రైతులను ఉద్దేశించి, జిల్లాలో ఎక్కడైనా సరే అధిక ధరలకు ఎరువులు విక్రయించినట్లయితే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారి లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించాలని తెలిపారు.ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి జావేద్, తదితరులు పాల్గొన్నారు.






