7 July, 2026 | 10:17 PM

చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

07-07-2026 09:00 PM

* ఇరు వర్గాలపై బైండవరి కేసు నమోదు: సీఐ చరమంద రాజు 

గరిడేపల్లి,(విజయక్రాంతి): చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హుజూర్నగర్ సిఐ చరమందరాజు అన్నారు. గరిడేపల్లి లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల కేంద్రమైన గరిడేపల్లి లోని దాబాలో సోమవారం ఘర్షణ పడిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. వీరితోపాటు దాబా హోటల్ యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గొడవ పడిన ఇరు వర్గాలకు చెందిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అనంతరం తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా గుంపులుగా చేరి గొడవలకు కారణమైతే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సమావేశంలో గరిడేపల్లి ఎస్ఐ బి శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.