24 April, 2026 | 11:52 AM

Breaking News

కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •   అటెండర్ గా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సన్మానం   •   పాలేరులో ప్రజల ముంగిటకే 'ప్రజా దర్బార్'   •  

ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిది

19-11-2025 12:00 AM

ఖైరతాబాద్: నవంబర్ 18 (విజయ క్రాం తి): భాగ్యనగరం ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిదని, పక్షుల ప్రేమికులు లక్షల సంఖ్య లో ఉన్నారని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్, ఇండియన్ బరడ్స్ జర్నల్ సీనియర్ ఎడిటర్ ఆశిష్ పిట్టి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కళ పత్రిక, జయహో పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎ.మంగ రచన రేఖా చిత్రాలతో రూపొందించిన బర్డ్ వాచర్ జర్నల్ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది.

హైదరాబాద్ ఆర్నిథాలజిస్ట్ ఆశిష్ పిట్టి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి, చిత్రకారిణి, ఫోటోగ్రాఫర్ వి. ఎ.మంగను అభినందించారు. ఇటీవల కాలం లో భాగ్యనగరంలో బర్డ్ వాచింగ్ అభిరుచి ఉధ్రుతంగా పెరిగిందన్నారు. సభాధ్యక్షత వ హించిన కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మ హ్మద్ రఫీ మాట్లాడుతూ సరళమైన తెలుగు భాషలో అందమైన అరుదైన పక్షుల విశేషాలతో పుస్తకం ఆసక్తికరంగా రచయిత్రి మంగ తీసుకొచ్చారని అభినందించారు.

డాక్టర్ వి. ఎ. మంగ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తరువాత సరదాగా తీసిన ఫోటోగ్రఫీకి చిక్కిన తేనె పిట్ట తనలో పక్షులపై విపరీతమైన ఆసక్తిని పెంచి అభిరుచిగా మార్చినట్లు తెలిపారు. సినీ దర్శకుడు శివ నాగేశ్వరరావు, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య పుస్తకాన్ని సమీక్షిస్తూ పక్షులతో తమకున్న అనుబంధాన్ని అనుభవాలను వివరించారు. జయహో పబ్లికేషన్స్ పి.వై.బాబు సమన్వయం చేశారు.