30 June, 2026 | 10:36 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పోలీసులపై రాళ్లతో దాడి

18-12-2025 02:02 AM

ఎస్సై తలకు గాయాలు, వాహనాలు ధ్వంసం

ఆదిలాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాం తి): ఆదిలాబాద్ జిల్లా సీతాగొంది గ్రా మం లో బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినప్పటికీ, కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం ఆందోళన నెలకొంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేం ద్రం వద్ద గుమ్మగిడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ప్రజ లు పరుగులు తీసే క్రమంలో ఒక రు మురికి కాలువలో పడటంతో కాలు విరి గి, తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్రహించిన గ్రామస్థు లు పోలీసులకు ఎదురుతిరిగి, కొందరు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఎస్సై పురుషోత్తం తలకు గాయాలు కాగా, పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం ఆయ్యాయి.