తనిఖీలు చేసి.. పాఠాలు చెప్పిన కలెక్టర్
ఖానాపూర్ జూలై 7 (విజయక్రాంతి): జిల్లా పాలనాధికారి భవేష్ మిశ్రా మంగళ వారం మారుమూల పెంబి మండలంలో ఆ కస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల, మందపల్లి కేజీబీవీ పాఠశాలలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ కు ఉపాధ్యాయులు విద్యార్థులు స్వాగతం పలికారు. తరగతి గదిలోకి గదిలోకి వెళ్లిన జి ల్లా కలెక్టర్ పదో తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను బోర్డుపై రాసి సమాధానాలు రాబట్టారు.
ప్రతిరోజు బడికి సార్లు సమయానికి వస్తున్నారా. పాఠాలు చెబుతున్నారా పుస్తకాలు ఇ చ్చారా అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ బడిలో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి అక్కడికి వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఏ అవసరంలో తక్షణం పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వి ద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అధికారులు ఉన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన
పెంబి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆయన ఉద్యోగుల హాజరు పట్టిక మందుల రిసిప్ట్ స్టాకు వివరాలు రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం 24 గంటలు అందించేందుకు వైద్య సిబ్బంది కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజేందర్ ఆసుపత్రి సిబ్బంది స్థానిక అధికారులు ఉన్నారు.






