calender_icon.png 23 February, 2026 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ

23-02-2026 01:24:23 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరగనుంది. వచ్చే మూడు నెలలపాటు తాగునీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, భూసేకరణ, భూముల కేటాయింపులు, ఉద్యోగాల భర్తీ, సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 5 సాగునీటి ప్రాజెక్టులకు సవరించిన అంచనాలపై చర్చించనున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు భూముల కేటాయింపుపై చర్చించనున్నారు.