23-02-2026 01:12:58 PM
హైదరాబాద్: కోఠిలోని డీఎంహెచ్ఓ(DMHO) కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు(ASHA workers protest) కోఠిలో ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్లు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఆశా వర్కర్లకు వేతనం రూ. 18 వేలకు పెంచాలని వర్కర్ల డిమాండ్ చేస్తున్నారు. ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. ధర్నాకు వస్తున్న ఆశా వర్కర్లను(ASHA workers) పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తమకు మూడు నెలల నుండి జీతాలు ఇవ్వడంలేదని ఆశా వర్కర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 18 వేలు కనీసం వేతనం, రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో(Telangana Assembly Budget) నిధులు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం ఆశా కార్మికులకు పెంచిన రూ.1500 పారితోషికాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశా వర్కర్, పోలీసుల మధ్య తోపులాటలో ఆశా వర్కర్ స్పృహతప్పి పడిపోయింది.