వృక్షాబంధన్ వేడుకలు
29-08-2026 05:34 PM
రాజాపూర్ ఆగస్టు 29(విజయక్రాంతి): మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారంవిద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి పాఠశాలలో ఉన్న మదర్ చెట్టుకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు వృక్షాలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చెట్టు యొక్క ఆవశ్యకత, ఆక్సిజను, మెడిసిన్ గా పండ్లను నీడనిచ్చేది, కలపనిచ్చేదిగా, ఉపయోగపడుతుందని వివరించారు.ప్రతి విద్యార్థి పాఠశాలలో,ఇంటిదగ్గర మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






