అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు
15-06-2026 09:06 PM
చేర్యాల: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ఓ రైతు పట్టా భూమి నుండి మట్టిని ముస్త్యాల గ్రామంలోని ఒక ఇటుకల బట్టికి తరలిస్తున్నట్లు సమాచారం మేరకు సోమవారం చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్న సమయంలో మట్టిని రవాణా చేస్తున్న ఐదు టిప్పర్లను గుర్తించి వాహనాలను చేర్యాల పోలీస్ స్టేషన్కు తరలించినట్టు తెలిపారు. తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమ మైనింగ్, మట్టి రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






