13 March, 2026 | 5:42 PM

మైనార్టీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ ఈద్ కా తోఫాను అందజేత

13-03-2026 04:56 PM

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ వొడ్నాల శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో  మైనార్టీ  కుటుంబాలకు రంజాన్ ఈద్ కా తోఫాను అందజేయడం జరుగుతుందని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ వొడ్నాల శ్రీనివాస్ అన్నారు.  మంథని పట్టణంలోని మైనార్టీ కుటుంబాలకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ఆదేశాల మేరకు పవిత్ర రంజాన్ కు సంబంధించి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసే రంజాన్ ఈద్ కా తోఫాను మైనారిటీ కుటుంబాలకు అందజేశారు.