19 May, 2026 | 9:47 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ఆందోళన వద్దు.. అండగా ఉంటా

30-10-2025 10:11 PM

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ పరిధి ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ వరద ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. అనంతరం మాట్లాడుతూ వరద ముంపు బాధితులను పరామర్శించి, కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా మంత్రి సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారికి భరోసా కల్పించారు.