4 July, 2026 | 8:05 PM

Breaking News

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ పర్యటన

30-10-2025 10:14 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): మొంథా తుఫాన్ తో భారీ వర్షంతో హనుమకొండలోని అలంకార్ సర్కిల్, కాపువాడలో వరద ప్రభావిత ప్రాంతాలను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పరిశీలించారు. వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు పాల ప్యాకెట్లు, త్రాగునీరు పంపిణీ చేశారు. ప్రజలకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు సూచించారు. నిత్యం అండగా ఉంటూ అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు.