13 March, 2026 | 9:38 PM

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

13-03-2026 08:22 PM

పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

నంగునూరు,(విజయక్రాంతి): రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం నంగునూరు మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యా అధికారి తగిరెడ్డి దేశిరెడ్డి తెలిపారు. మండలంలోని నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 245, రాజగోపాల్‌పేట పాఠశాలలో 185 మొత్తం 430 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినంత మంది సిబ్బందిని నియమించామని, పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.