19 May, 2026 | 9:44 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే

19-05-2026 08:27 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): మే 20న జరగనున్న దేశవ్యాప్త మెడికల్ దుకాణాల బంద్ సందర్భంగా జిల్లాలో ప్రజలకు మందుల లభ్యతలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ విశ్వంత్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ పట్టణ కేంద్రాల్లో కనీసం మూడు మెడికల్ దుకాణాల చొప్పున బంద్ రోజున కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీలు, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని జీవన్ ధారా జనరిక్ మెడికల్ షాపులు యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. మెడ్‌ప్లస్, అపోలో వంటి రిటైల్ ఫార్మసీ చైన్‌లు కూడా సేవలు కొనసాగిస్తాయన్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం ప్రజలు 8333818147 నంబర్ ద్వారా జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించాలని సూచించారు.