21 July, 2026 | 1:34 AM

జింబాబ్వేకు పయనమైన టీ20 జట్టు

20-07-2026 12:45 AM

కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ముంబై, జూలై 19 : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగియడంతోనే భారత టీ20 జట్టు జింబాబ్వేకు పయనమైంది. రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ 23 నుంచి ప్రారంభం కా నుంది. శేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి సిరీ స్ విజయం కోసం ఎదురుచూస్తున్న టీమిండియాకు ఈ పర్యటన కూడా కీలకంగానే చెప్పొచ్చు. ఈ టూర్ కోసం భారత టీ20 జట్టులోని పలువురు ఆటగాళ్లు జింబాబ్వేకు బయలుదేరిన ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.

గంభీర్ స్థానం లో తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ, సూర్యాంశ్ షెడ్గే, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ కూ డా జింబాబ్వేకు బయలుదేరారు.టీ20 కెప్టె న్ శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హర్ష్ దూబే, ఇషాన్ కిషన్, ప్రిన్స్ యాదవ్ కూడా ఇంగ్లాండ్ నుంచి నేరుగా జింబాబ్వేకు వెళ్లనున్నారు. జింబాబ్వే టూర్ నుంచి గంభీర్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. జింబాబ్వే పర్యటనతో పాటు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడ ల్లో పాల్గొనే భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఉండే అవకాశం ఉంది.  జిం బాబ్వేతో మూడు టీ20లు వరుసగా జులై 23, 25, 26 తేదీలలో జరుగుతాయి.