3 March, 2026 | 10:40 PM

తండ్రి మందలించాడని కుమారుడు అదృశ్యం

03-03-2026 09:10 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): తండ్రి మందలించాడని కుమారుడు అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  మేడిపల్లి, సత్యనారాయణపురం కాలనీలో నివసించే రామ్ శెట్టి శ్రీను (45) స్థానికంగా వాటర్ ప్లాంట్ బిజినెస్ నిర్వహిస్తున్నాడు. అతని కుమారుడు రామ్ శెట్టి మహేష్ (23) చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నాడని మందలించడంతో గత నెల 27న రాత్రి మహేష్ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు అని తెలిపారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలలో వెతకిన ఆచూకీ లభించ లేదని, తండ్రి శ్రీను మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.