10 May, 2026 | 1:43 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

‘ప్రాణహిత’లో సెమీ క్రిస్మస్

25-12-2025 02:35 AM

 హైదరాబాద్, డిసెంబర్ 24: చైతన్యపురిలోని ప్రాణహిత హాస్పిటల్ ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఆసుపత్రి ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలతో సుందరంగా అలంకరించారు.హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ రెడ్డి, ప్రముఖ వైద్యు లు అశోక్ కుమార్,అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి వేడుకల ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగలు మనలో స్నేహభావాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు మానసిక ఉల్లాసాన్ని అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.వేడుకల్లో భాగంగా ఆసుపత్రి యాజమాన్యం రోగులకు, వారి సహాయకులకు ప్రత్యేక బహుమతులను పంపిణీ చేసింది. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.