10 May, 2026 | 2:46 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

కోట పబ్లిక్ స్కూల్‌లోక్రిస్మస్ సంబురాలు

25-12-2025 02:36 AM

కరీంనగర్ (రేకుర్తి), డిసెంబర్ 24(విజయక్రాంతి): కరీంనగర్‌లోని రేకుర్తి ప్రాంతం లో గల కోట పబ్లిక్ స్కూల్ కేంద్ర కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ సంబరాలు బు ధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సేవాభావాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

యేసుక్రీస్తు బోధించిన సత్యం, త్యాగం, మానవతా విలువలు విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆ కాంక్షించారు. విద్యార్థులు క్రిస్మస్కు సంబంధించిన పాటలు, నృత్యాలు, నాటికలు ప్రద ర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.