26 May, 2026 | 5:41 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

బరితెగిస్తున్న ఇసుక మాఫియా

24-03-2026 05:07 PM

పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్

తాండూరు,(విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫియా బరితెగిస్తుంది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ వాహనంపైకి దూసుకు రావడంతో వాహనం ముందరి భాగం పాక్షికంగా ధ్వంసం అయింది. బషీరాబాద్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రెండు ఇసుక ట్రాక్టర్ల ను అడ్డుకొని వివరాలు సేకరించినందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పోలీస్ వాహనంపైకి ట్రాక్టర్ దూసుకుని వచ్చి ఢీ కొట్టింది.

వాహనంలో ఉన్న పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గతంలో కూడా ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్ను ఇసుక ట్రాక్టర్ తో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. తాజా ఘటనలో పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్లను కనుగొనేందుకు పోలీసులు  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్రమ ఇసుక రవాణాకు స్థానికంగా కొందరు అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసనల్లోనే ఇసుక మాఫియా నడుస్తుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.