గ్యాస్ కొరత.. ప్రసాదం బంద్
15-03-2026 12:21 AM
కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయంలో అన్నదానం, ప్రసాదాల విక్రయాలు నిలిపివేత
ఎల్బీనగర్, మార్చి 14: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఆలయాలను తాకింది. ఆలయాల్లో అన్నదానం, ప్రసాదాల తయారీకి ఎల్పీజీ గ్యాస్ వినియోగిస్తారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం, గ్యాస్ డిస్టిబ్యుటరీ కంపెనీలు కూడా గ్యాస్ సప్లై చేయలేమని చేతులెత్తేయడంతో ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో స్వామివారికి నిత్యము జరిపే ఆరగింపులను నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో లావణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలో ఆదివారం నుంచి భక్తులకు ప్రసాద వితరణ, భోగములు, నిత్యాన్నదానం, ప్రసాదాలు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.




