15 March, 2026 | 1:49 AM

భక్తిశ్రద్ధలతో రంజాన్‌ను జరుపుకోవాలి

15-03-2026 12:22 AM

అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్, మార్చి 14(విజయక్రాంతి): ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అంబ ర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శనివారం అంబర్ పేట నియోజకవర్గం పరిధిలోని గోల్నాక డివిజన్ పరిధి లోని మసీద్ కరీమా ఒమర్జ్ (జిందా మస్జిద్), మసీ ద్-ఇ-గుల్జార్ ఇబ్రహీం ఓ ఇస్మాయిల్ (క్వాద్రి బాగ్ మసీద్) వద్ద నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్ర మంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు స్థానిక ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అర్హులైన కుటుంబా లకు రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.