11 April, 2026 | 10:46 PM

రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపు

11-04-2026 08:52 PM

ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాలియా నాయక్

కామారెడ్డి,(విజయక్రాంతి): రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించే పనిని శనివారం విద్యుత్ అధికారులు, ఇబ్బంది కలిసి విజయవంతంగా పూర్తి చేసినట్లు కామారెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ సాలియా నాయక్ తెలిపారు. ప్రజలకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ పనులను సమర్థవంతంగా పూర్తి చేసిన డివిజనల్ ఇంజనీర్  కళ్యాణ చక్రవర్తి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్  అశోక్, ఏఈలు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ చర్యలతో భద్రతా ప్రమాణాలు మెరుగుపడినట్లు స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.