calender_icon.png 18 February, 2026 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన బ్రిడ్జి నిర్మించాలని రాయపురం గ్రామస్తుల ధర్నా

18-02-2026 12:34:21 AM

గట్టు ఫిబ్రవరి 17: భారత్ మాల రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన రోడ్డు పనుల్లో గట్టు మండలం రాయపురం గ్రామస్తులు బ్రిడ్జ్ సౌకర్యం లేక గ్రామానికి చేరుకునేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు మంగళవారం బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్త్స్ర శేఖర్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ధర్నా విరమించాలని సమస్య ఏదైనా ఉంటే ఉన్నత అధికారులకు సమాచారం అందిస్తామని తెలిపారు