15 June, 2026 | 11:46 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రాజ్యసభ సభ్యుడు రవిచంద్రకు అభినందనల వెల్లువ

04-10-2025 12:07 AM

మహబూబాబాద్, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా  మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఎన్నికవ్వడంతో హర్షం వ్యక్తం అవుతుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామక ప్రక్రియలో భాగంగా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మరోసారి పెట్రోలియం సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఈ మేరకు లోక్ సభ డిప్యూటీ సెక్రెటరీ సుజయ్ కుమార్ శుక్రవారం నియామాక ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 31 మంది సభ్యులు గల ఈ కమిటీలో లోక్ సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ప్రాతినిద్యం వహిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి నియామాకం అయ్యే ఈ కమిటీకి రవిచంద్ర వరుసగా మూడోసారి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ దఫా పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా లోక్ సభ ఎంపీ సునీల్ దత్తాత్రేయ తట్కరే కొత్తగా ఎన్నికయ్యారు.