26 May, 2026 | 4:44 PM

గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో

26-05-2026 03:50 PM

బోథ్,మే 26(విజయక్రాంతి): గ్రామాలలో గుడిసెలలో నివాసం ఉండే వారి జాబితాలను గ్రామాల కార్యదర్శి సిద్ధం చేయాలని సోనాల ఎంపీడీవో మహేందర్(Sonala MPDO Mahender) పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో వివిధ గ్రామాల కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా. ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఇంటింటి కీ వెళ్లి వారి ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఇండ్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు.

రానున్న రోజుల్లో ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోనున్నందున పేదలకు లబ్ధి చేరే విధంగా నమోదు చేయాలన్నారు. వాస్తవాలను పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక జరపాలని సూచించారు. ఇండ్లు ఉండి కూడా గుడిసెలలో నివసిస్తే వారు అర్హులు కాదని పేర్కొన్నారు. గ్రామంలో ఒక గుడిసె లేకుంటే 100% ఇండ్లు ఉన్నాయనే నివేదిక ఇవ్వాలన్నారు. అవకతవకలు జరిగితే కార్యదర్శులే బాధ్యులు అవుతారని గుర్తించారు. సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు