ప్రజా పాలన మండల స్థాయి సమావేశం
16-04-2026 04:09 PM
జైనూర్/లింగాపూర్ (విజయక్రాంతి): లింగాపూర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం లింగాపూర్ రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం. సురేష్ కుమార్ పాల్గొని ప్రజా పాలన అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందించాల్సిన సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల పనితీరును పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎ. రాంచందర్, తహసీల్దార్, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.






