27 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
19-05-2026 12:00 AM
జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభం
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): ఈనెల 27 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈమేరకు సోమవారం పాలిసెట్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. 27 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29 నుంచి జూన్ 1 వరకు, జూన్ 6 వరకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. సీటు పొందిన అభ్యర్థులు జూన్ 9 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. 9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. తుది విడత కౌన్సిలింగ్ జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. జూలై 1న స్పాట్ అడ్మిషన్లను చేపట్టనున్నారు.






