అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు
09-05-2026 05:07 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): అక్రమంగా పరిమితికి మించి ఎద్దులు తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని శనివారం సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, ఎస్సైలు చంద్ర కుమార్, అశోక్ రెడ్డి లు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న ఎద్దులను గుర్తించడం జరిగిందని తెలిపారు,కంటైనర్ లో 30 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కంటైనర్ లో ఎద్దులను కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నారని తెలిపారు. డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు.






