మంత్రులతో ప్రధాని మోదీ సమీక్ష
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, పెట్రోలియం, విద్యుత్, ఎరువుల రంగాలను సమీక్షించి, వాటి స్థితిగతులను పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సీనియర్ మంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిరంతర సరఫరా, స్థిరమైన రవాణా వ్యవస్థ, సమర్థవంతమైన పంపిణీని నిర్ధారించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వర్గాలు తెలిపాయి.
వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రపంచ పరిణామాలను నిరంతరం పర్యవేక్షించడం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశం. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్, రామ్మోహన్ నాయుడు, హర్దీప్ సింగ్ పురి, పీయూష్ గోయల్ హాజరయ్యారు.




