14 July, 2026 | 4:08 PM

Breaking News

ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •  

ఈవీ చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక

18-04-2026 12:53 AM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. 

ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల అమలుపై సచివాలయంలో శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రవాణ, రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రణాళిక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణశాఖ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ శశాంక, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీరెడ్‌కో ఎండీ అనిలా వవిల్లా, ఓఈఎం ప్రతినిధులు పాల్గొన్నారు.