14 July, 2026 | 4:20 PM

Breaking News

వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •  

బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి

14-07-2026 04:04 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పొట్పల్లి నుంచి నారాయణఖేడ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో నాగన్ పల్లి కి చెందిన విద్యార్థి తెనుగు అఖిల తండ్రి గంగారామ్ తన పదో తరగతి (టెన్త్) ఒరిజినల్ మెమోలను పొరపాటున పోగొట్టుకుంది. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అవసరమైన ఈ ముఖ్యమైన ధ్రువపత్రాలు కనిపించకపోవడంతో విద్యార్థి ఆందోళన చెందుతుంది. ఈ మెమోలు ఎవరికైనా లభించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలనీ లేదా సంబంధిత విద్యార్థిని సంప్రదించి అందజేయాలని విజ్ఞప్తి చేశాడు. ప్రజలు సహకరించి విద్యార్థికి విలువైన ధ్రువపత్రాలు తిరిగి అందేలా సహాయం చేయాలని కోరుతున్నారు.