14 July, 2026 | 3:55 PM

Breaking News

తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •  

కార్మికులకు ఆరోగ్య భరోసా

14-07-2026 03:38 PM

హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీలోని వ్యర్థాల సేకరణ కార్మికులకు నమస్తే పథకం కింద ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు, వ్యక్తిగత రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో మంగళవారం  జరిగిన కార్యక్రమంలో కార్మికులకు కార్డులు, రక్షణ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, వారి ఆరోగ్యం, భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.