10 May, 2026 | 8:08 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఈదుర గాలులకు లేచిపోయిన రేకులు

11-10-2025 12:31 AM

నిరాశ్రయులైన పేద కుటుంబం

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని అప్పన్నపేట గ్రామంలో గురువారం రాత్రి వచ్చిన ఈదురు గాలులు కొద్దిసేపు బీభత్సం సృష్టించింది.విపరీతంగా గాలులు,వర్షం రావడంతో కొత్త అప్పన్నపేట గ్రామంలో కొంతమంది ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.కొమ్మరాజు లక్ష్మి ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా లేచిపోయాయి.గాల్లోకి లేచిన రేకులు దూరంగా ఖాళీ స్థలంలో పడడంతో ప్రమాదం తప్పింది. వీటితోపాటు లక్ష్మీ ఇంటిలో ఉన్న విలువైన సామాగ్రి  దెబ్బతిన్నాయి.

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు బాధిత కుటుంబాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. బాధితురాలు కొమర్రాజు లక్ష్మి మాట్లాడుతూ ఈదురుగాలి తాకిడికి సుమారు మూడు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు.ఈదురు గాలులతో నష్టపోయిన లక్ష్మీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని మాజీ వార్డు సభ్యులు మదారు కోరారు.