13 July, 2026 | 5:12 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

నాగోల్‌లో నూతన స్కేటింగ్ గ్రౌండ్ ప్రారంభం

13-07-2026 12:00 AM

ఆనంద్‌నగర్‌లో ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్

నాగోల్, జూలై 12 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్కేటింగ్ గ్రౌండ్ను తాజా మాజీ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి క్రీడా వేదికలు యువతలోని ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు.

స్థానిక యువత ఈ స్కేటింగ్ గ్రౌండ్ను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రాస్ స్కేటింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కన్నబోయిన యాదయ్య, డైరెక్టర్ బందారం సాయి ప్రసాద్, క్రీడాకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు,  పాల్గొన్నారు.