27 July, 2026 | 7:20 PM

విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి

27-07-2026 06:23 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): విద్యాబోధనలో నూతన విధానాలను అవలంబించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని మల్లాపూర్ మండల విద్యాధికారి (ఎంఈఓ) దామోదర్ రెడ్డి సూచించారు. సోమవారం మల్లాపూర్ మండలం రాఘవపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వృత్త్యాంతర శిక్షణ (ఇన్-సర్వీస్ ట్రైనింగ్) తరగతులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న బోధనా పద్ధతులు, నైపుణ్యాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించేలా ఆధునిక బోధనా విధానాలను అనుసరించాలని, ప్రతి విద్యార్థి అభ్యాస ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, శిక్షకులు పాల్గొన్నారు.