20-02-2026 01:58:26 AM
రేవల్లి ఫిబ్రవరి 19: వనపర్తి జిల్లా, రేవల్లి మండలంలోని ముంపు బండరాయిపాకులలో గుర్తుతెలియని దుండగులు బరితెగిం చారు. స్థానిక శివాలయంలోని పురాతన నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులు.. నంది విగ్రహం ముక్కలై ఉండటం చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుండగులు రా ళ్లతో కొట్టి విగ్రహం కొమ్ములు,చెవులు, ఇత ర భాగాలను విరగ్గొట్టారు.
ఛత్రపతి శివాజీ జయంతి రోజే శతాబ్దాల చరిత్ర గల విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై గ్రామస్తులు, హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించి, దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.