రాజోలిలో అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి
అలంపూర్: రాజోలి మండల కేంద్రం పరిధిలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణాను తక్షణమే అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.సోమవారం రాజోలి తహసీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ గోకారిలకు వినతిపత్రం అందజేశారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో పాటు బోర్లు, బావులు ఎండిపోతున్నాయని, భారీ టిప్పర్లు, ట్రాక్టర్ల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.
30-06-2026