20-02-2026 01:57:21 AM
ఇద్దరు ఫిబ్రవరి 19: పట్టణ కేంద్రం తో పాటు పలు గ్రామాలలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను గురువారం ప్రజా ప్రతినిధులు, యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలు గా మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ సుమిత్ర ఎల్లారెడ్డిలు హాజరై విగ్రహాలకు పూలమాలలు వేసి దేశభక్తి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...
స్వాతంత్ర పోరాటంలో భారతీయు లకు మనోధైర్యాన్ని నింపి ధర్మం, నాయ్యం, సమానవత్వం,హిందూ వాదనలతో దేశభక్తి పెంచి ముందుకు సాగించి చరిత్రలో నిలిచిపోయిన మహానీయుడు చత్రపతి శివాజీ మహారాజు అని గుర్తు చేశారు. అనంతరం చత్రపతి శివాజీ మహారాజ్ జెండాలు పట్టుకొని యువకులు వీధులలో బైక్ ర్యాలీ తిరి గారు. ఈ కార్యక్రమంలో వార్డుల కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, వార్డ్ మెం బర్లు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.