ప్రత్యేక వ్యూహాలతో పట్టు సాధించాలి
06-10-2025 12:00 AM
రాజాపూర్ అక్టోబర్ 5: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో పట్టు సాధించాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ తరపున ఈద్గాన్ పల్లి, మల్లేపల్లి,నాయిన్ చెర్వు తండా, దొండ్లపల్లి, తిర్మలాపూర్, చెన్నవెల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో, సర్పంచు లు,ఎంపీటీసీ ఆశావాహుల నుండి వినతులను స్వీకరించారు. సేకరించిన సర్పంచ్,ఎంపీటీసీ అ భ్యర్థుల పూర్తి వివరాలను డీసీసి, పీసీసీ కమిటీ కి పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు నాయక్, లక్ష్మయ్య, శ్రీశైలం యాదవ్, రమేష్ రెడ్డి, సత్యనారాయణ,పంచాక్షరీ ,శ్రీకాంత్ రెడ్డి, గోపీనాథ్, శివకుమార్, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




