14 July, 2026 | 11:05 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. కత్తులు దూస్తున్న ఇరాన్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. కత్తులు దూస్తున్న ఇరాన్

14-07-2026 09:50 AM

ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం

ఇరాన్ ఓడరేవులను దిగ్భంధిస్తాం: ట్రంప్

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్త(Tensions in West Asia) పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా, ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కత్తులు దూసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ కు నౌకలు వెళ్లకుండా, రాకుండా హర్మూజ్(Hormuz)లో  అడ్డుకుంటామని ట్రంప్ తెలిపారు. ఇతర నౌకలు మాత్రం హర్మూజ్ ను స్వేచ్ఛగా వాడుకోవచ్చని సూచించారు. నౌకల్లోని సరుకు విలువలో 20 శాతం వరకు టోల్ వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.

ట్రంప్ ప్రకటనపై(Trump's announcement) ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. తమ నౌకలను అడ్డుకుంటే బలప్రయోగానికి దిగితామని ఇరాన్ హెచ్చరించింది. తమ అనుమతి తేలకుండా అమెరికా రక్షణతో వెళ్లే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా సైన్యానికి సాయం చేయకూడదని గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. అమెరికా వలే 20 శాతం కాకుండా తక్కువ రుసుం వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.