9 April, 2026 | 5:35 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

గడి మైసమ్మకు మున్సిపల్ కార్మికుల బోనాలు

09-04-2026 03:29 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): పట్టణంలోని గడి మైసమ్మ కు మున్సిపల్ కార్మికులు గురువారం బోనాలతో ఊరేగింపు చేపట్టారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు బోనాలతో మున్సిపల్ కార్యాలయం నుండి గడి మైసమ్మ ఆలయం వద్దకు ఊరేగింపుకు వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు.

అనంతరం  చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కార్యాలయం నుండి అమ్మవారికి బోనాలతో నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, అమ్మవారి దయతో గ్రామం అంత చల్లగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ మాసుల ప్రవీణ్, బత్తుల నరేష్,కాజా అజీముద్దీన్, నాయకులు ముకీం,మేనేజర్ వెంకటలక్ష్మి,అజ్మతుల్ల బేగ్, సానిటేషన్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, వెంకటేష్ అధికారులు పరిశుద్ధ కార్మికులు కార్యాలయ పాల్గొన్నారు.