7 July, 2026 | 3:54 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

07-07-2026 02:39 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మఠంపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు ప్రభు ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ జెండా కేవలం ఒక జెండా మాత్రమే కాదని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం,సమాన హక్కులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సాగిన ఉద్యమానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ జెండా ఐక్యత,ధైర్యం,సేవాభావం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో హక్కుల సాధన కోసం నిరంతరం స్ఫూర్తినిస్తుందని అన్నారు. అనంతరం పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ప్రజాసేవను మరింత కాలం కొనసాగించాలని ఆకాంక్షించారు.