7 July, 2026 | 3:11 PM

Breaking News

ప్రతి ఓటరును చైతన్యం చేయండి   •   ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ముప్పు   •   మొహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎస్‌ఐఆర్ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్   •   సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •  

పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు

07-07-2026 02:37 PM

– రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్

ముకరంపుర,(విజయక్రాంతి): నీటి పారుదల శాఖ ఇంజనీర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన చొల్లేటి బుచ్చిరెడ్డి సన్మాన సభ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఉద్యోగుల సమక్షంలో  జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, చొల్లేటి బుచ్చిరెడ్డి ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ పొందారని, వారి సేవా తపనకు, నిజాయితీకి, మానవీయ విలువలకు పదవీ విరమణ ఉండదన్నారు. జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టి ఎన్‌జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఇరిగేషన్ ఇంజనీర్ కేవలం కాలువలు నిర్మించే అధికారి కాదని, రైతు ఆశలను సాకారం చేసి వేలాది కుటుంబాల జీవితాల్లో సంతోషాన్ని నింపే మహోన్నత శిల్పి అని అన్నారు.