మర్రికుంటలో ఉపాది హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో
20-03-2026 02:33 PM
దోమకొండ,మార్చి 20,(విజయ క్రాంతి): ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా,99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా శుక్రవారం దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో రోడ్డు ఇరువైపులా ఉన్న మొక్కలకు వాటర్ పట్టించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్. అనంతరం దోమకొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలోని మర్రి కుంటలో ఉపాధి హామీ పనులు చేపట్టిడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 87 మంది కూలీలు హాజరైనారు ఇట్టి కూలీలకు ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించవలసిందిగా సంబంధిత పంచాయతీ కార్యదర్శి , ఉపాధి హామీ సిబ్బంది కి ఆదేశించారు. కొలతల ప్రకారం పనులు చేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన కూలి అందరికి రావాలని కోరారు.




