24 April, 2026 | 7:19 PM

Breaking News

అమరులైన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు ఘన నివాళులు   •   శివాజీనగర్ అంగన్‌వాడి కేంద్రంలో గర్భవతులకు సీమంతం   •   ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య   •   ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుంది   •   చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి   •   నిరుపేదల సొంతింటి కల నెరవేరడం ఆనందంగా ఉంది   •   హిందూ సమ్మేళనానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ ఆహ్వానం   •   డీసీఎం, ద్విచక్ర వాహనం ఢీ... వ్యక్తి మృతి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలను బేషరతుగా వెంటనే పరిష్కరించాలి   •   ఇల్లందు పట్టణంలో జరుగు అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయండి   •  

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ రవిచంద్ర

24-04-2026 05:40 PM

ఖమ్మం,(విజయక్రాంతి): తన‌ సిఫార్సు మేరకు ప్రభుత్వం నుంచి మంజూరైన  సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం పంపిణీ చేశారు. ఈ మేరకు ఖమ్మం బుర్హాన్ పురంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ. 8.50 లక్షల విలువైన చెక్కులను 19 మంది బాధితులకు అందజేశారు. మరో ఇద్దరికి ముందస్తు ఆపరేషన్ నిమిత్తం మంజూరైన రూ. 4 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన పలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్న బాదితులను పరామర్శించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.