అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
07-05-2026 01:53 AM
కూకట్పల్లి, మే 6 (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని కూకట్పల్లి, కెపిహెచ్బి కాలనీ డివిజన్లలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. కూకట్పల్లి డివిజన్ లోని సాయిబాబానగర్, ఏవీబీ పురంలలో రూ.50 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు, ప్రశాంత్నగర్లో రూ. 75 లక్షల వ్యయంతో చేపట్టనున్న కమాన్ సెంటర్ మీడియన్ పనులకు హాజరై శంకుస్థాపన చేశారు.
అనంతరం కే పిహెచ్బి డివిజన్ నాలుగో పేజ్లో రూ. 16 లక్షల విలువ గల వాటర్ వర్క్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మందాడి శ్రీనివాసరావు, ఆవుల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు బొట్టు విష్ణు, సంతోష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.






