జారిపడి ఎమ్మెల్యేకు గాయాలు
23-04-2026 12:18 AM
పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్
పటాన్చెరు, ఏప్రిల్ 22 : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో బాత్ రూంలో కాలుజారి పడడంతో స్వల్పంగా గాయలయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని, తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు. కాగా గూడెం మహిపాల్రెడ్డి అస్వస్థత విషయం తెలుసుకున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం ఆపోలో ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే జీఎంఆర్ త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.






