ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు
02-07-2026 10:02 AM
చేగుంట,జూలై 02,(విజయక్రాంతి): ఆటో బోల్తా పడి పదిమందికి తీవ్ర గాయాలైన సంఘటన చేగుంట పట్టణ కేంద్రం చోటుచేసుకుంది, స్థానికుల వివరాల ప్రకారం చేగుంట గ్రామస్తులు తమ సమీప బంధువుల పెళ్లి కోసం చిన్న శంకరంపేట్ గ్రామానికి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఆటో అద్భుతప్పి బోల్తాపడడంతో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి, వారిని సమీప ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు






