4 July, 2026 | 10:58 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

26-11-2025 12:00 AM

కొండాపూర్, నవంబర్ 24 : కొండాపూర్ మండలం తొగర్ పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా మంగళవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులు గోపులారం సంతోషకు రూ.23,000, బొడ్డు క్రాంతికి రూ.13,500, కుమ్మరిగొల్ల మధుకు రూ.21,500 కలిపి మొత్తం రూ.58,000 చెక్కులు అందజేశారు.

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడు తూపేదవారి ఇబ్బందులు, వైద్య ఖర్చులు, అత్యవసర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ తో ఆదుకుంటోందని తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రోళ్ల రవి మాట్లాడుతూ మా గ్రామంలో ఎవరికీ ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.