11 May, 2026 | 11:56 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

అయ్యప్ప మహా పడిపూజలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు

03-12-2025 09:42 PM

సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో భక్తి, భవిష్యత్తులను నింపుతూ అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఆధ్యాత్మిక వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం అందుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనేలా చేస్తాయి. భక్తి మార్గం మనిషిని మంచిదారిలో నడిపించే శక్తి కలిగి ఉందని వ్యాఖ్యానించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ఉదయ్ కుమార్ సాగర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ మహా పడిపూజలో చింత సాయినాథ్, రవికుమార్ సాగర్, అభయ్ కుమార్ సాగర్, గోవర్ధన్ నాయక్, జీవి శ్రీనివాస్ తదితరులు పాల్గొని అయ్యప్పస్వామి ఆశీస్సులు పొందారు.